Bharuch Blast: ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Gujarat Bharuch Blast: PM Modi Express Grief Announce Exgretia - Sakshi

గుజరాత్‌లో భరూచ్‌లోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 

అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ ఘటన అర్ధరాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్‌ దగ్గర పని చేస్తుండగా పేలుడు సంభవించి వాళ్లంతా మృత్యువాత పడ్డట్లు భరూచ్‌ ఎస్పీ లీనా పాటిల్‌ తెలిపారు. ప్రమాదంలో ఇంకెవరూ గాయపడలేదని వెల్లడించారు. 

ఈ ఘటనపై  ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్‌ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top