భారత్‌లో కొత్తగా 37,975 కరోనా కేసులు

Coronavirus: 37975 New Positive Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 37,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  91,77,841కి చేరింది. కరోనాతో తాజాగా మరో 480 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య  1,34,218కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,314 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 4,38,667 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.76 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.46శాతానికి తగ్గింది. యాక్టివ్‌ కేసుల శాతం 4.78గా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top