యువ జర్నలిస్టు దారుణ హత్య! | Bihar Journalist And RTI Activist Died Found Burned Tossed By Roadside | Sakshi
Sakshi News home page

యువ జర్నలిస్టు దారుణ హత్య!

Nov 14 2021 9:43 AM | Updated on Nov 14 2021 9:43 AM

Bihar Journalist And RTI Activist Died Found Burned Tossed By Roadside - Sakshi

పట్నా: బీహార్‌ రాష్ట్రంలోని మధుబనీ జిల్లాలో నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన యువ జర్నలిస్టు, సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కార్యకర్త బుద్ధినాథ్ ఝ అలియాస్‌ అవినాశ్‌ ఝ(22) శుక్రవారం సాయంత్రం శవమై కనిపించాడు.

బుద్ధినాథ్ ఝ స్థానిక న్యూస్‌ పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. నకిలీ ఆస్పత్రుల పేర్లను ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో అధికారులు సదరు అస్పత్రులను మూసివేశారు.కొన్నింటికీ జరిమాన విధించారు.

ఈ నేపథ్యంలో బుద్ధినాథ్ ఝను నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అయితే శుక్రవారం సగం కాలినస్థితిలో రోడ్డు పక్కన పడి ఉ‍న్న అతడి మృతదేహాన్ని  పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement