నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు

Dec 21 2025 12:44 PM | Updated on Dec 21 2025 12:44 PM

నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు

నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు

కోస్గి రూరల్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత తమ నైపుణ్యాల ఆధారంగానే ఉపాధి అవకాశాలు వరిస్తాయని ఏస్‌ (ఏసీఈ) ఇంజినీరింగ్‌ అకాడమీ చైర్మన్‌ వి.గోపాలకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ విద్యార్థులకు భవిష్యత్‌ దృక్పథాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం, ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవడం, సాప్ట్‌స్కీల్స్‌, ఆన్‌లైన్‌, ఆప్‌లైన్‌ శిక్షణ వంటి అంశాలపై అవగాహన చేపట్టారు. లాటరల్‌ ఎంట్రీ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్శహించేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పలువురు విద్యార్థులు భవిష్యత్‌ కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలను అడిగి వివృత్తి చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన దిశగా ముందుకు సాగలన్నారు. ప్రొఫెసర్‌ మూర్తి కళాశాల అభివృద్ధికి అవసరమైన నాలుగు డిజిటల్‌ బోర్డులు, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌, 200 ఫైబర్‌ చైర్స్‌, సోలార్‌ లైటింగ్‌ సిస్టంలను విరాళంగా అందించారు. అంతకుముందు కళాశాల అవరణలో పూల మొక్కులను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ హేమంత్‌, ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement