లక్ష ఎకరాలకు | - | Sakshi
Sakshi News home page

లక్ష ఎకరాలకు

Sep 15 2025 10:45 AM | Updated on Sep 15 2025 10:45 AM

లక్ష ఎకరాలకు

లక్ష ఎకరాలకు

రిలే దీక్షలను విరమింపజేసిన మంత్రి

సీఎం రేవంత్‌రెడ్డి డ్రీమ్‌ ప్రాజెక్టు పేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం

ఎకరాకు రూ. 20లక్షల పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం

విలేకర్ల సమావేశంలో

రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ

మంత్రి వాకిటి శ్రీహరి

సాగునీరు అందించడమే లక్ష్యం

భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. భూ పరిహారం పెంచిన ప్రభుత్వానికి భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మశ్చందర్‌ ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు. అనంతరం సీవీఆర్‌ భవన్‌కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొనంగేరి హన్మంతు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్‌, సరాఫ్‌ నాగరాజు, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం పాల్గొన్నారు.

నారాయణపేట: పేట–మక్తల్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఎన్‌ఆర్‌ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్‌ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్‌తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు.

62 రోజుల్లోనే పరిహారం పెంపు..

రాష్ట్రంలో ఎక్కడైనా భూ పరిహారం పెంపు నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం కూడా అంత త్వరగా తీసుకోలేదని.. కానీ జిల్లావాసి సీఎం రేవంత్‌రెడ్డి కావడంతోనే కేవలం 62 రోజుల్లోనే ఎకరాకు రూ. 20లక్షలకు పరిహారం పెంచడం అందరి అదృష్టంగా భావించాలని మంత్రి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలోని నేరడగాం, భూత్పూర్‌, సంగబండ, అనుగొండ, జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు తెలుసన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు.

సాగు, తాగునీరు లేక గోస..

ఈ ప్రాంతంలో ఏళ్లుగా సాగు, తాగునీరు లేక జనం గోస పడుతున్నారన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎల్లూరు నుంచి మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, మన్యంకొండ మీదుగా మరికల్‌ వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి మక్తల్‌, నారాయణపేటకు తాగునీరు అందిస్తున్నారన్నారు. నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతలతో తాగు, సాగునీటి గోస తీరుతుందన్నారు. అంతకుముందు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడారు. భూ నిర్వాసితులు తమకు రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ 62 రోజులుగా చేపట్టిన ఉద్యమానికి తెర పడిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి వెళ్లి ఒప్పించడం జరిగిందన్నారు. రైతులకు ఎకరానికి రూ. 20లక్షల పరిహారం ఇచ్చేందుకు సీఎం ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement