లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు

May 16 2026 1:09 AM | Updated on May 16 2026 1:09 AM

న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి

లీలా వెంకటశేషాద్రి

కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. కల్లూరు ముజఫర్‌ నగర్‌ సచివాలయంలో పోక్సో యాక్ట్‌పై శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాగృతి పథకం 2025 కింద సురక్షిత బచ్చన్‌ – సురక్షిత భవిష్యపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పోక్సో చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్‌ సర్వీసెస్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 15100కు కాల్‌ చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కిశోర వికాసం కింద బాల్య వివాహాలతో జరిగే నష్టాల గురించి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ శారద వివరించారు. అనంతరం బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞను పిల్లలతో చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement