మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి పంట చేతికందే తరుణంలో భారీ వర్షాలతో పైరు నేలవాలి ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. ఈ ఏడాది రబీ సీజన్లో మూడు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేసేందుకు నారుమడిని సిద్ధం చేసుకున్నాను. కుందూనదికి ఈ ఏడాది మార్చి వరకు నీటిని విడుదల చేస్తే సాగునీరు పుష్కలంగా అందుతుంది. వరి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి కష్టాలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మోహన్రెడ్డి, రైతు,
వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం


