డ్రోన్‌ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం

Oct 2 2025 8:05 AM | Updated on Oct 2 2025 8:05 AM

డ్రోన

డ్రోన్‌ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం

● ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్‌ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బన్ని ఉత్సవాల్లో 10 డ్రోన్‌ కెమెరాలతో పాటు 110 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ఎవరైనా గాయాలపాలైతే వెంటనే వైద్యం అందించేందుకు 20 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రితో పాటు 104, 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 మంది ట్రబుల్‌ మాంగర్స్‌, సారా విక్రేతలను బైండోవర్‌ చేశామన్నారు. కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా 340 రింగుల కర్రలు, నాటుసారాను సీజ్‌ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఐదు చెక్‌పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. బన్ని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకో వాలని భక్తులకు ఎస్పీ సూచించారు.

తప్పిన ప్రమాదం

ఆస్పరి: మండల కేంద్రం సమీపంలోనున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ దగ్గర విద్యత్‌ స్తంభాన్ని బుధవారం ఓ లారీ ఢీ కొట్టింది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్తంభం లేకుంటే నేరుగా లారీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లోకి దూసుళ్లేదని ట్రాన్స్‌కో సిబ్బంది తెలిపారు. మహారాష్ట్ర నుంచి చక్కెర లోడుతో ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీని ఒక కారు ఓవర్‌ టేక్‌ చేసి వెళ్లే క్రమంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద సడన్‌ బ్రేక్‌ వేయడంతో.. లారీ డ్రైవర్‌ కారును తప్పించే క్రమంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌, క్లీనర్‌ వెంటనే లారీ నుంచి కిందకు దూకేశారు. ప్రమాదంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆస్పరి పోలీసులు తెలిపారు.

డ్రోన్‌ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం 1
1/1

డ్రోన్‌ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement