
ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పింఛన్లు తప్పించి ఏ పథకం పూర్తిగా అమలు చేయకపోయినా అన్ని చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఈ మోసాన్ని ప్రజలు ఏడాది లోపే గమనించారన్నారు.