
కంచి పీఠాధిపతికి మహానందీశుని ప్రసాదాలు
మహానంది: కంచి కామకోటి మూలామ్నయ సర్వజ్ఞ పీఠంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, 71వ పీఠాధిపతిగా శిష్య స్వీకారం చేసిన సత్యచంద్రశేఖరేంద్రసరస్వతి స్వామికి బుధవారం మహానందీశ్వరుడి ప్రసాదాలు అందించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఆలయ వేదపండితులు చెండూరి రవిశంకర అవధాని, ఏఈఓ ఎరమల మధు వెళ్లి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదాలు అందించారు.
వైభవంగా
అక్షయ తృతీయ వేడుక
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర అక్షయ తృతీయ వేడుక వైభవంగా నిర్వహించారు. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి గంధ లేపనం గావించి విశేష పూజలు కానిచ్చారు. రెండు గంటల పాటు వేద మంత్రోచ్ఛారణలతో పూజోత్సవాలు నిర్వహించారు. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అక్షయ తృతీయ కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు.
పాలిసెట్కు 562 మంది గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 22 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ను బుధవారం నిర్వహించగా 562 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,682 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 3,784 మంది బాలురు, 1,898 మంది బాలికలు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న బాలురుల్లో 3466 మంది, బాలికల్లో 1,654 మంది పరీక్షకు హాజరైనట్లు నంద్యాల జిల్లా పాలిటెక్నిక్ జిల్లా కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు.
రుద్రవరంలో బాల్య వివాహం
రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం బెస్త కాలనీకి చెందిన ఓ యువకుడికి ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన బాలికకు బుధవారం గ్రామ సమీపాన ఉన్న ఆలయం వద్ద వివాహం చేశారు. బాలిక పెళ్లి విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ సీడీపీఓ తేజశ్వరి అక్కడికి చేరుకొని విచారించారు. వధూవరులతో పాటు పెద్దలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడ ఆమె ఫిర్యాదు ఇవ్వగా వధూవరుల కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వరప్రసాదు తెలిపారు.
నిర్మాణాలు త్వరగా
పూర్తయితే బిల్లులు
సంజామల: గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకుంటే బిల్లులు అందుతాయని లబ్ధిదారులకు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి గోపాల్ తెలిపారు. మండల పరిధిలోని ఆర్.లింగందిన్నె, పేరుసోముల, రామిరెడ్డిపల్లె గ్రామాలో ఉన్న హౌసింగ్ కాలనీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లడుతూ.. ప్రభుత్వం నుంచి అదనంగా వచ్చే బిల్లులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 30లోపు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకి అడిషినల్ పేమెంట్ వర్తిస్తుందని తెలిపారు. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాల కోసం బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు,ఎస్టీలకు రూ.75 వేలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ బాలచంద్రుడు, వర్క్ ఇన్స్పెక్టర్స్, ఇంజినీర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

కంచి పీఠాధిపతికి మహానందీశుని ప్రసాదాలు

కంచి పీఠాధిపతికి మహానందీశుని ప్రసాదాలు