
అంతా సర్దుబాటే
కూటమి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు ఇచ్చిందేమీ లేదు. ఉన్న వాటినే సర్దుబాటు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇవ్వాలి. ఇప్పటికే భర్తలను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరికీ వితంతు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలి. స్పౌజ్ కేటగిరీ దరఖాస్తులతో పాటే వారికి దరఖాస్తులు తీసుకొని పింఛన్లు మంజూరు చేయాలి. – రంగనాయుడు,
సీపీఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల
దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలో ప్రస్తుతం స్పౌజ్ కేటగిరి కింద 2023 డిసెంబర్ 21 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య 3,159 మంది పింఛన్ దారులు చనిపోయారు. వారి భార్యలు స్పౌజ్ కేటగిరి కింద సచివాలయంలో ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి.
– శ్రీధర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ, నంద్యాల

అంతా సర్దుబాటే