
లిమిటేషన్ యాక్ట్తో కేసుల సత్వర పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): లిమిటేషన్ యాక్ట్తో కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలు ఉంటుందని జిల్లా జడ్జి జి.కబర్ధి పేర్కొన్నారు. జిల్లా కోర్టులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ జడ్జీలకు లిమిటేషన్ యాక్ట్పై శనివారం వర్కుషాపు నిర్వహించారు. ముందుగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. లిమిటేషన్ యాక్ట్పై క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. అప్పుడు కేసులను సత్వరమే పరిష్కరించడానికి వీలు అవుతుందన్నారు. అనంతరం రిసోర్స్పర్సన్లు విశ్రాంత న్యాయమూర్తులైన మోహన్రావు, ఎస్.రజనీలు మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు కమలాదేవి, పీజేసుధాకర్, అమ్మనారావు, పి.వాసు, ఎం.శోభారాణి, ఎన్. శ్రీవిద్య పాల్గొన్నారు.
న్యాయమూర్తుల వర్కుషాపులో
జిల్లా జడ్జి జి.కబర్ధి