మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం
నూతనకల్ : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో ఇటీవల హత్యకు గురైన ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి పరామర్శించారు. మల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పదేళ్ల పరిపాలనలో హత్యా రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, మున్న మల్లయ్య, ఎస్ఏ రజాక్, చూడి లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, మహేశ్వరం మల్లికార్జున్, బత్తుల సాయిలుగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కనకటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
లింగంపల్లిలో పర్యటించిన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


