సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

Sep 3 2025 4:07 AM | Updated on Sep 3 2025 4:07 AM

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

మునుగోడు : విద్యార్థులు ఎలాంటి సీజనల్‌ వ్యాధులకు గురికాకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని డీఈఓ భిక్షపతి సూచించారు. మంగళవారం మునుగోడు మండలంలోని కిష్టాపురం, పలివెల ఉన్నత పాఠశాలలు, మునుగోడు కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. మధ్యాహ్న భోజనాని, పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు వెంకటయ్య, తాటి శ్రీనివాసులు, బొల్లం మోహన్‌, ఎస్‌ఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement