రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి

Jun 30 2025 7:40 AM | Updated on Jul 1 2025 7:31 AM

రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి

రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి

త్రిపురారం : రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వీరపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రెండో మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రైతుల పక్షాణ చేస్తున్న పోరాటాలను అనచివేస్తు రైతలకు నష్టం చేసే నల్ల చట్టాలను తీసుకవచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల రైతు సంఘం అధ్యక్షుడు కొప్పు వెంకన్న, సీపీఎం మండల కార్యదర్శి దైద శ్రీను, కందిమళ్ల వీరారెడ్డి, వెంకటయ్య, రాములు, రామచంద్రు కోటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement