రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు | - | Sakshi
Sakshi News home page

రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు

May 5 2025 9:06 AM | Updated on May 5 2025 9:06 AM

రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు

రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు

పంటల సాగుపై ముందస్తు అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమం

రసాయన ఎరువుల వాడకం తగ్గించడమే లక్ష్యం

కార్యాచరణ సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

నేటి నుంచి జూన్‌ 13 వరకు అవగాహన సదస్సులు

అవగాహన కార్యక్రమాలు

నిర్వహించే గ్రామాలు

త్రిపురారం: కంపాసాగర్‌, బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి, మాటూర్‌, రాగడప, బెజ్జికల్‌

అనుముల: తిమ్మాపురం, నాయుడుపాలెం, ఇబ్రాహీంపేట, చల్మరెడ్డిగూడెం, హజారిగూడెం, మదారిగూడెం, పాలెం

నిడమనూరు: బంకాపురం, తుమ్మడం, నిడమనూరు, శాఖాపురం, వెనిగండ్ల, బొక్కమంతలపాడు, గుంటిపల్లి, వల్లభాపురం

మిర్యాలగూడ: జప్తివీరప్పగూడెం

తిప్పర్తి: తిప్పలమ్మగూడెం

తిరుమలగిరి సాగర్‌: నెల్లికల్‌

త్రిపురారం : వచ్చే వానాకాలం సీజన్‌లో వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై గ్రామీణ రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా రైతు ముంగిటకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వెళ్లే అవగాహన కల్పించేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం (ఈ నెల 5వ తేదీ) నుంచి జూన్‌ 13వ తేదీ వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్యవిద్యాలయం, కేవీకే కంపాసాగర్‌, వరి పరిశోధన స్థానం కంపాసాగర్‌ శాస్త్రవేత్తలు మండల వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

ఇదీ.. ప్రధానోద్దేశం

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గంచుకోవడం, పురుగు మందుల వాడకంతో చీడపీడల నివారణ మార్గాలు, విత్తానాభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులను వివరించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. అలాగే, సమీకృత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, యాంత్రీకరణ, వ్యవసాయ శాఖ పథకాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement