నేటి నుంచి రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

May 5 2025 9:06 AM | Updated on May 5 2025 9:06 AM

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

నకిరేకల్‌: భూ భారతి చట్టం–2025 అమలులో భాగంగా నకిరేకల్‌ మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, మండలంలో సోమవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. నకిరేకల్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సదస్సుల నిర్వహణకు రెండు టీంలను నియమిస్తున్నామన్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు జరపాలన్నారు. ఈ సదస్సుల్లో రైతులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, నకిరేకల్‌ తహసీల్దార్‌ జమీరుద్దీన్‌, కట్టంగూర్‌ తహసీల్దార్‌ ప్రసాద్‌నాయక్‌, రెవెన్యూ అదికారులు పాల్గొన్నారు.

సదస్సుల షెడ్యూల్‌..

5న అడవిబొల్లారం, తెట్టెకుంట, 6న మండలాపురం, నెల్లిబండ, 7న చందంపల్లి, వల్లాబాపురం, 8న పాలెం, తాటికల్‌, 9న ఓగోడు, గోరెంకలపల్లి, 12న మంగళపల్లి, మర్రూరు, 13న చందుపట్ల, కడపర్తి, 14న నోముల, నకిరేకల్‌ పట్టణంలో సదస్సులు నిర్వహించనున్నారు.

ఫ భూ భారతి పైలట్‌ ప్రాజెక్టుగా నకిరేకల్‌ మండలం ఎంపిక

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement