
మధుసూదన్రెడ్డి.. నా ఆత్మీయుడు
నల్లగొండ : కష్ట, సుఖాల్లో నా వెన్నంటి ఉన్న ఏదుళ్ల మధుసూదన్రెడ్డి నాకు ఆత్మీయుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన మధుసూదన్రెడ్డి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభలో మంత్రి మాట్లాడారు. మధుసూదన్రెడ్డితో తన అనుబంధం 30 ఏళ్లు అని, ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం తన వెన్నంటి ఉన్నాడని పేర్కొన్నారు. తన వ్యక్తిగత సహాయకుడిగా రోజూ వందలాదిమంది సమస్యలను ఓపికతో విని తన దృష్టికి తీసుకొచ్చేవాడన్నారు. ఉద్యోగిగా పదవి విరమణ పొందినా.. తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు మధుసూదన్రెడ్డి తనకు అండగా ఉంటాడని పేర్కొన్నారు. అనంతరం మధుసూదన్ రెడ్డి–జ్యోతి దంపతులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఆర్డీఓ అశోక్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మధుసూదన్రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి పాల్గొన్నారు.
ఫ అన్ని వేళలా నా వెన్నంటి ఉన్నాడు
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి