
ప్రభుత్వ స్థలాలే టార్గెట్..
కల్వకుర్తి మున్సిపాలిటీగా ఏర్పడక ముందే పలు ప్రభుత్వ స్థలాలను ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అనుచరుల మాటున కబ్జా చేసి.. అక్రమ లే అవుట్లను సృష్టించి అమ్మేశారు. మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత కౌన్సిలర్లుగా పనిచేసిన వారు సైతం అదే పనిలో బిజీగా ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, రోడ్లను తమ అనుచరులచే కబ్జా చేయించడం.. తిరిగి వారే మున్సిపాలిటీలో ఫిర్యాదు చేయడం.. వాటిని వారే పరిష్కరించినట్లుగా చిత్రీకరించి.. తిరిగి వాటి గురించి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.