ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం

May 29 2025 12:31 AM | Updated on May 29 2025 12:31 AM

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం

కొల్లాపూర్‌ రూరల్‌: రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదని.. మహాత్మా గాంధీజీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌లో భాగంగా బుధవారం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు నుంచి నార్లాపూర్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి జూపల్లి పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఎల్లూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్ర అనంతరం నార్లాపూర్‌లో గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే నేతృత్వంలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పేద, బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గాంధీజీ, అంబేడ్కర్‌ ఆశయాలు, సిద్ధాంతాలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హన్మంతు నాయక్‌, మేకల నాగరాజు, రహీంపాషా, ఎగ్బాల్‌, ఇమిడిశెట్టి వెంకటస్వామి, రఘుపతిరావు, శేఖర్‌ రెడ్డి, రామన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

రాజ్యాంగం విలువలను ప్రజల్లోకితీసుకెళ్లడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement