జీవన నైపుణ్యానికి బాటలు | - | Sakshi
Sakshi News home page

జీవన నైపుణ్యానికి బాటలు

Apr 20 2025 12:48 AM | Updated on Apr 20 2025 12:48 AM

జీవన

జీవన నైపుణ్యానికి బాటలు

అచ్చంపేట: అనాథ బాలికలు, ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న బాలికలను కస్తూర్బాగాంధీ విద్యాలయాలు అక్కున చేర్చుకుంటున్నాయి. ఇంటర్మీడియట్‌ వరకు వసతితో కూడిన విద్యను అందిస్తూ ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. మెరుగైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్న కేజీబీవీలను బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నెల 17న వార్షిక పరీక్షలు ముగియగా.. 24 నుంచి వేసవి సెలువులు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు ఆరురోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థినుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపునకు దోహదపడుతాయని భావిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధ్యతలు గుర్తించేలా..

జిల్లాలోని 20 కస్తూర్బాల్లో 5,784 మంది బాలికలు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వార్షిక పరీక్షలు ముగియడం, వారు వెళ్లిపోవడంతో 4 వేల మంది బాలికలు ఉన్నారు. వేసవి సెలవులకు ముందు చివరి ఆరురోజుల్లో జీవితంలో ఉన్నతంగా స్థిరపడే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల కలలు సాకారం చేసేందుకు తల్లిదండ్రులు వారి బాధ్యతను గుర్తిచేలా ప్రత్యేక కార్యక్రమం దోహదపడనుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందనే సందేశం ఇవ్వనున్నారు.

కార్యక్రమాలు ఇలా..

● శుక్రవారం మిగతా ఐదు రోజుల ప్రణాళికపై సమావేశం నిర్వహించారు.

● శనివారం విద్యార్థులకు నచ్చిన, ఇష్టమైన కథలు తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషాల్లో రాయించారు.

● మూడోరోజు తమకు తాము పరిచయం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులను పరిచయం చేయడం.

● నాలుగోరోజు పిల్లలు తమ ఆకాంక్షలను అమ్మానాన్నలకు చదవి వినిపించడం.

● ఐదోరోజు కస్తూర్బాలో చదివి ఉన్నతంగా ఎదిగిన వారి విజయగాథలు, ఆత్మ గౌరవ కార్యక్రమాలు వివరిస్తారు.

● ఆరోరోజు జీవిత నైపుణాల్యపై అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తన, బాల్యవివాహాలపై నాటికలు ప్రదర్శిస్తారు.

● చివరిరోజు తల్లిద్రండులు, ఉపాధ్యాయలతో సమావేశం ఉంటుంది.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..

బాలికల భవితపై మార్గనిర్దేశనం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి తమ కలలు సాకారం చేసుకునేలా అత్మ విశ్వాసం పెరగనుంది. లక్ష్యాలు సాధించుకోవాలనే పట్టుదల పెరుగుతుంది.

– శోభారాణి, జీసీడీఓ, నాగర్‌కర్నూలు

సద్వినియోగం చేసుకుంటా..

విద్య మాత్రమే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్న మహనీయుల స్పూర్తితో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతున్నా. ఆరు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఆత్మ విశ్వాసంతో కలలు సాకారం చేసుకునేందుకు శ్రమిస్తా.

– వైష్ణవి, 8వ తరగతి, కేజీబీవీ, బల్మూర్‌

కస్తూర్బాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

వేసవి సెలవుల ఆరంభం వరకు ప్రణాళిక

జీవన నైపుణ్యానికి బాటలు 1
1/2

జీవన నైపుణ్యానికి బాటలు

జీవన నైపుణ్యానికి బాటలు 2
2/2

జీవన నైపుణ్యానికి బాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement