వడ్లు కాంట అయి 10 రోజులు అవుతుంది. లారీలు లేక ధాన్యం బస్తాలు మిల్లుకు పోవడం లేదు. అధికారులను నమ్ముకుంటే పని అయితలేదని లారీ కోసం నేనే పొద్దున 40 కిలోమీటర్లు దూరంలో ఉ న్న గోవిందరావుపేట మండలంలోని లారీ ఆఫీస్కు వచ్చి కూర్చున్నాను. సాయంత్రం వరకు పంపిస్తాం అంటున్నారు. మేము కష్టపడి పండించిన ధాన్యం తవడకుండా ప్రభుత్వం త్వరగా మిల్లులకు తరలించాలి. వాన పడుతుందేమోనని ఇంటికి కూడా వెళ్లడం లేదు. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.
– అజ్మీరా లాల్ ప్రసాద్, కన్నెపల్లి, ఎస్ఎస్తాడ్వాయి మండలం


