ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఇప్పపువ్వు లడ్డూలు విక్రయిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన గిరిజన ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి ఒక బాక్స్లో పెట్టి రూ.100 చొప్పున ఐటీడీఏకు వచ్చి వెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ మహిళా సంఘం సభ్యులు ఇప్ప పువ్వును సేకరించి వాటితో స్వచ్ఛమైన బెల్లంతో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలతో అనేక పోషకాలు అందుతాయని వివరిస్తూ విక్రయిస్తున్నారు. దీంతో పలువురు లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


