రహదారి నిర్మించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

రహదారి నిర్మించాలని నిరసన

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

రహదారి నిర్మించాలని నిరసన

వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు నిలిచిపోయిన రహదారిని నిర్మించాలని కోరుతూ ప్లకార్డులతో సీపీఎం నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు అటవీ అనుమతులు లేవని రహదారి పనులు నిలిపివేశారని అన్నారు. ఈ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో నాలుగు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రహదారి దిగ్భంధనం చేస్తామని తెలిపారు. నిరసన తెలిపిన వారిలో సదాక్రేన్‌, నరేష్‌, మహేందర్‌, రమేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement