వెంకటాపురం(కె): మండలంలో ఘనంగా వాడ బలిజ సేవ సంఘం ఆవిర్భావ వేడుకలను సోమవారం నిర్వహించారు. మండల పరిధిలోని వీఆర్కె పురం గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాడబలిజ సేవ సంఘం జెండాను వాడ బలిజసేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్రా దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాడ బలిజల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాడబిజసేవ సంఘం నాయకులు తోట ప్రశాంత్, కొప్పుల మల్లికార్జున్, బద్ది ఆదినారాయణ, బోగట విజయ్, పవన్, సనుగొండ వెంకన్న, పోతురాజు, నాగార్జున ఉన్నారు.


