‘ముఖ గుర్తింపు’తో సమయపాలన | - | Sakshi
Sakshi News home page

‘ముఖ గుర్తింపు’తో సమయపాలన

Dec 16 2025 4:22 AM | Updated on Dec 16 2025 4:22 AM

‘ముఖ గుర్తింపు’తో సమయపాలన

‘ముఖ గుర్తింపు’తో సమయపాలన

కేయూ క్యాంపస్‌: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్‌వర్కింగ్‌ సెల్‌ డైరెక్టర్‌ డి.రమేశ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement