ఇసుక రీచ్‌ నిలిపివేయాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌ నిలిపివేయాలని నిరసన

Dec 13 2025 7:52 AM | Updated on Dec 13 2025 7:52 AM

ఇసుక రీచ్‌ నిలిపివేయాలని నిరసన

ఇసుక రీచ్‌ నిలిపివేయాలని నిరసన

ఇసుక రీచ్‌ నిలిపివేయాలని నిరసన

ములుగు రూరల్‌: రైతులకు నష్టం చేస్తున్న అబ్బాయిగూడెం ఇసుక రీచ్‌ను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం అబ్బాయిగూడెం రైతులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌ ముంజాల భిక్షపతి గౌడ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ అబ్బాయిగూడెంలోని ఇసుక రీచ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల పంటలకు నష్టం కలిగేలా విద్యుత్‌ స్తంభాలను విరగొట్టారని వివరించారు. దీంతో రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట నాగేశ్వర్‌రావు, బొల్లె రాంబాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement