ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి

Jul 16 2025 9:24 AM | Updated on Jul 16 2025 9:24 AM

ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి

ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి

ఐసీటీసీ కౌన్సిలర్‌ వెంకటేశ్వర్లు

ఏటూరునాగారం: ప్రజలు ఎయిడ్స్‌ వ్యాధిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సామాజిక వైద్యశాల ఐసీటీసీ కౌన్సిలర్‌ గులగట్టు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని రామన్నగూడెంలో మంగళవారం ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు దిశ వారి సౌజన్యంతో హెల్త్‌ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్‌, టీబీ, హైపటైటిస్‌బీ, సిఫిలిస్‌, హెచ్‌ఐవీ పరీక్షలు 50 మందికి చేసినట్లు వివరించారు. ఎవరికై నా హెచ్‌ఐవీపై అనుమానం ఉంటే క్రాస్‌రోడ్డులోని సామాజిక ఆస్పత్రిలో ఐసీటీసీ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్‌సీ మొబైల్‌ వాహన కౌన్సిలర్‌ అనూష, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సాగర్‌, ఏఎన్‌ఎం ధనలక్ష్మి, హెల్త్‌ అసిస్టెంట్‌ జైలు బాబు, గ్రామ కార్యదర్శి జ్యోతి, ఆశ కార్యకర్తలు కాశింబీ, లావణ్య, ఔట్‌ రీచ్‌ వర్కర్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement