సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

Jun 28 2025 6:01 AM | Updated on Jun 28 2025 8:47 AM

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

మంగపేట: సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. మండంలోని మల్లూరు పంచాయతీ పరిధిలోని కేసీఆర్‌కాలనీలో కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు ఆదేశాల మేరకు చుంచుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి యమున ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీతో పాటు గ్రామంలోని 175 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. 25 మంది జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్‌ వ్యాధులు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా జనావాసాల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, మురుగు నీరు, వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్‌ ఐటీడీఏ ఏటూరునాగరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, ఎన్‌వీబీడీసీపీ వైద్యాధికారి చంద్రకాంత్‌, ఎంసీహెచ్‌ మంగపేట వైద్యాధికారి ప్రశాంత్‌, నాగరాజు, తరుణ్‌, ఏఎన్‌ఎం సీతమ్మ, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement