సౌకర్యాలపై దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాలపై దృష్టి పెట్టండి

Jun 3 2025 5:39 AM | Updated on Jun 3 2025 5:39 AM

సౌకర్యాలపై దృష్టి పెట్టండి

సౌకర్యాలపై దృష్టి పెట్టండి

నేడు మంత్రి సమీక్ష

నేడు(మంగళవారం) మహాజాతర అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క ఆయా శాఖల అధికారులతో మేడారంలోని ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పనుల పురోగతి, ఇంకా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

ఎస్‌ఎస్‌తాడ్వాయి: వచ్చే ఏడాది జరిగే మేడారం మహాజాతరకు ముందుగానే ఈసారి శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతిఏటా హడావుడిగా పనులు చేపట్టడంతో భక్తులు ఇబ్బంది పడడంతో పాటు పనుల్లో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సారి జాతరకు ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క జాతర పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మేడారంలో రోడ్ల నిర్మాణంతో పాటు శాశ్వత నిర్మాణం పనులు సాగుతున్నాయి. పనులు బాగానే ఉన్నా జాతర సమయంలో భక్తులకు ఉపయోగపడే సౌకర్యాలౖపై జిల్లా అధికారులు, మంత్రి సీతక్క దృష్టి పెట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలి

ఊరట్టం– జంపన్నవాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలి. ఊరట్టం జంపన్నవాగుపై 2006లో ఏటూరునాగారం మండల పరిధిలోని దొడ్ల, కొండాయి, ఏటూరునాగారం ప్రాంతాల నుంచి వచ్చే ఎడ్లబడ్ల దారి కోసం జంపన్నవాగు లోలెవల్‌ కాజ్‌వే నిర్మించారు. నిర్మించిన ఏడాదికే కాజ్‌వే జంపన్నవాగు వరద తాకిడికి ధ్వంసమవుతూనే ఉంది. మరమ్మతులు చేస్తున్నా కాజ్‌వే నిలవడం లేదు. గతేడాది మహాజాతర సమయంలో రూ. 20లక్షలతో కాజ్‌వై మరమ్మతులు చేసినా ధ్వంసమైంది. ప్రతిఏటా లక్షల నిధులు ఖర్చు చేస్తున్నా కాజ్‌వై నిలిచిన దాఖలాలు లేవు. ఊరట్టం–జంపన్నవాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించడం వల్ల వాహనాల రాకపోకలకు, ఎడ్లబండ్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మంత్రి సీతక్క చొరవ చూపి ఈ సారి జాతర వరకు వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వీఐపీల దర్శనానికి ప్రత్యేక క్యూలైన్‌

మహాజాతరలో వీఐపీల దర్శనానికి ప్రత్యేక క్యూలైన్‌ నిర్మించాలి. జాతర సమయంలో వీఐపీలు, వీవీఐపీలు దర్శనానికి వచ్చిన సమయంలో భక్తులను క్యూలైన్‌లో గంటల తరబడి దర్శనాలు నిలిపివేయడంతో సహనం కోల్పోయి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి జాతరలో వీఐపీలు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేయాలి. అదే విధంగా మేడారం జాతరకు వచ్చే వీఐపీలను శివరాంసాగర్‌ చెరువు సమీపంలోని రోడ్డు మరమ్మతు పనులు చేయాలి.

శాశ్వత డ్రెస్సింగ్‌ గదులు..

జంపన్నవాగుపై మూడు చోట్ల శాశ్వత డ్రెస్సింగ్‌ గదులను నిర్మించారు. జాతర సమయంలో మా త్రమే వాటిని వినియోగంలోకి తీసుకువస్తున్నారు. జాతర తర్వాత మూలనపడుతున్నాయి. జాతర సమయంలోనే కాకుండా నిత్యం మేడారానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులు స్నానాలు అచరించే చోట డ్రెస్సింగ్‌ గదులు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రెస్సింగ్‌ గదుల సమీపంలో షవర్లను ఏర్పాటు చేస్తే మహిళలు దస్తులు మార్చుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది.

మేడారంలో పలు అభివృద్ధి పనులపై మంత్రికి భక్తుల సూచనలు

నేడు జాతర పనులపై

మంత్రి అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement