
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సాధారణంగా ఉంటుంది. రాత్రి సమయంలో పలుచోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది.
ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభం
ములుగు: జిల్లాకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాల
అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ములుగు రూరల్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని కాన్పరెన్స్ హాల్లో కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో అర్హులను పారదర్శంగా ఎంపిక చేసి అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారికి ప్రస్తుతం ఆన్లైన్ చూపించడం లేదన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. మహాజాతరకు రూ.35 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, జాతరకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. జంపన్నవాగు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ములుగులో బస్టాండ్ నిర్మాణానికి, ఏటూరునాగారం బస్ డిపోకు నిధులు కేటాయించామన్నారు. ములుగు, ఏటూరునాగారంలో మార్కెట్ నిర్మాణ పనులు సాగుతున్నాయని తదితర వివరాలు వెల్లడించారు.