
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
● జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సంజీవరావు
మంగపేట: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సంజీవరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం మంగపేట మండలం మల్లూరు రెవెన్యూ గ్రామం గాంధీనగర్, వెంకటాపురం(ఎం) మండలం రామాంజాపూర్ శివారు గుంటూరుపల్లిలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగులో డ్రిప్ వినియోగం, ఎరువుల వాడకం, అంతర్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు రాయితీ వచ్చే డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మిర్చి కోల్డ్ స్టోరేజ్ను, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు శ్రీకాంత్, రమేష్, సిబ్బంది సాంబశివరావు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.