
జిల్లాలో టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు
జిల్లాలో రెండు బృందాలు
జిల్లాలోని పది మండలాల్లో నకిలీ విత్తనాల నియంత్రణకు రెండు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ములు గు, ఏటూరునాగారం డివిజన్ పరిధిలో తనిఖీలు చేపట్టేందుకు వ్యవసాయ అధికారులను, పోలీస్శాఖ టాస్క్ఫోర్స్ సీఐతో పాటు సిబ్బందిని నియమించింది. మండలాల వారీగా తనిఖీలు నిర్వహించే క్రమంలో వ్యవసాయ అధికారులకు సహకారంగా స్థానిక ఎస్సైలు తనిఖీల్లో పాల్గొంటారు. విత్తనాల అమ్మకాలపై తనిఖీ బృందాలు ప్రత్యేక నిఘా వేసి ఉంటున్నాయి.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద కొనుగోలు చేయడంతో పాటు రశీదులను తప్పని సరిగా పొందాలి. గ్రామాల్లో సీడ్ కంపెనీలు దళారులను ఏర్పాటు చేసుకొని రైతులను మోసం చేసే ప్రమాదం ఉంది. రైతులు విడిగా ఉండే విత్తనాలను కొనుగోలు చేయకూడదు.
ములుగు రూరల్: నకిలీ విత్తనాల అమ్మకాలు చేపడుతున్న వ్యాపారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ విత్తనాల అమ్మకాలను కట్టడి చేసేందుకు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో రెండు టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి మండలాల వారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలు చేపట్టే వారిపై టాస్క్ఫోర్స్ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టి అమ్మకాలు, రవాణా చేపట్టే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. గతేడాది జిల్లాలోని వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో అమాయకపు రైతులను కంపెనీ యజమానులు మోసం చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఈ ఏడాది నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.
క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు
వర్షాకాలం ప్రారంభం కావడంతో గ్రామాలలో రై తులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ దివాకర ఆ దేశించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ల వా రీగా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సాగు సూచనలు, విత్తన ఎంపిక, నకిలీ విత్తనాల అమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నకిలీ విత్తనాల అమ్మకాలపై వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించే విధంగా టోల్ఫ్రీ నంబర్ను రైతులకు అందించాలని సూచించారు. దీంతో పాటు డీలర్లతో సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాల అమ్మకాలు చేపడితే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దళారులను నమ్మి
మోసపోవద్దు
రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దళారులను నమ్మి మోసపోకూడదు. గ్రామాలలో లూజ్ విత్తనాలు అమ్మకాలకు వస్తే అధికారులకు సమాచారం అందించాలి. జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలకు తావు లేకుండా నిత్యం టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నాం.
– సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా
రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

జిల్లాలో టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు

జిల్లాలో టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు