
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ములుగు పట్టణంలో చేపట్టిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ను నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించండి అనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఉత్సవాలు, పెళ్లిల్లు జరిగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను వాడకూడదని వివరించారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలను తీసుకొచ్చేటప్పుడు ఇంటి నుంచే తీసుకెళ్లిన సంచుల్లో మాత్రమే తీసుకురావాలన్నారు. ఇంటిలోని చెత్తను ప్లాస్టిక్ కవర్లో వేసి చెత్తతో పాటు కుండీలో వేయకూడదన్నారు. అలా వేస్తే ఆ చెత్తతో పాటు ప్లాస్టిక్ సంచులను కూడా ఆవులు గేదెలు తిని ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు . ర్యాలీ అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్, రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి నాగన్వేషు పాల్గొన్నారు. శకుంతల, కోఆర్డినేటర్ భూపాల్ రెడ్డి, ప్రోగ్రాం మానిటరింగ్ సూపర్వైజర్లు సురేష్ బాబు, పీహెచ్ఎన్ శోభ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు రైజర్లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యదర్శి రమాదేవి, పార్టీ నాయకులు వివరించారు.
ప్లాస్టిక్ నివారణలో భాగస్వాములు కావాలి
ప్లాస్టిక్ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడారం పరిసర ప్రాంతాల్లో అడవిలో ఉన్న ప్లాస్టిక్ను తొలగించారు. ఏటూరునాగారం అభయారణ్యం, ఏటూరునాగారం సౌత్, నార్త్, పస్రా వన్యప్రాణి విభాగం అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి ప్లాస్టిక్ను ఏరివేతపై వివరించారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత