
సగం సగమే..
అసంపూర్తిగా ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు
ఈ ఫొటో ఏటూరునాగారం మండలంలోని మానసపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలది. ఇందులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. నలుగురు ఉపాధ్యాయులు, 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతి గదులు ఉండాల్సి ఉండగా మూడు గదులే ఉండడంతో ఒకటి ఆఫీస్ రూమ్, మరో రెండు గదుల్లో ఐదు తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. సౌకర్యాల లేమి కారణంగా విద్యార్థులు పాఠశాలలో చేరడం లేదని వాపోతున్నారు. శిథిలమైన ప్రహరీ ఎప్పుడు కూలిపోతుందోన ని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ప్రారంభించి అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర మరమ్మతులకు నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. ఈ విద్యాసంవత్సరానికి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ పాఠశాలలను పునఃప్రారంభించాల్సి ఉంది. గత సంవత్సరంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను ప్రారంభించినా.. ఇంత వరకు ఆయా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మరో ఐదు రోజులైతే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యం జిల్లాలో పలు పాఠశాలలను శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అసంపూర్తిగా పనులు..
మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు పనులను ప్రారంభించారు. నిధుల కొరత కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో గతంలో నిలిచిన పనులను పూర్తి చేయకుండా నూతన పనులు మొదలుపెట్టారు. అవికూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఏటూరునాగారం జెడ్పీఎస్ఎస్లో మరుగుదొడ్లు, మూత్రశాలల వద్ద పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉంది.
జిల్లాలో 318 పాఠశాలల్లో పనులు..
జిల్లాలోని 318 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.120 కోట్లతో పనులను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు 226, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ 13, 79 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పనులు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో 90శాతం వరకు పనులు పూర్తి అయినప్పటికీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనులు పూర్తి చేశారు.
జిల్లాలో 318 సూళ్లకు
రూ.120 కోట్లు కేటాయింపు
పలు పాఠశాలల్లో ప్రారంభం కాని మరుగుదొడ్ల నిర్మాణాలు
మరో ఐదు రోజుల్లో
బడులు పునఃప్రారంభం

సగం సగమే..

సగం సగమే..

సగం సగమే..

సగం సగమే..

సగం సగమే..