రైతులకు నష్టపరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Jun 7 2025 1:20 AM | Updated on Jun 7 2025 1:20 AM

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

గోవిందరావుపేట : జిల్లాలో ఇటీవల అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పస్రాలో సీపీఎం కార్యకర్తల జిల్లా సమావేశం రత్నం రాజేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రవికుమార్‌ హాజరై మాట్లాడారు. గల ఏప్రిల్‌, మే నెలలో కురిసిన వర్షాలతో 2,933 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా పరిహారం కింద రూ.5.72 కోట్లు జిల్లాకు విడుదల చేశారని వివరించారు. ఏజెన్సీలో రైతులకు పట్టాలు లేవని, కాస్తులో ఉన్న రైతులకు సైతం బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేయాలని కోరారు. ఇప్పటికై నా పరిహారం చెల్లించని క్రమంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాసిరకం విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎండీ దావూద్‌, చిట్టిబాబు, రఘుపతిరావు, ఆదిరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

రవికుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement