
ఆయిల్ ఫ్యాక్టరీకి భూ కేటాయింపు హర్షణీయం
ములుగు రూరల్ : జిల్లాలోని ఇంచర్ల గ్రామశివారులో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం 12ఎకరాల భూమిని కేటాయించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లంపల్లి మండలం, ములుగు, ఏటూరునాగరంలో బస్టాండ్, బస్ డిపోల ఏర్పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వెంకన్న, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్, వంగ రవియాదవ్, ఓంప్రకాశ్, చిక్కుల రాములు, నల్లెల్ల భరత్కుమార్, మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్