
తొంబై శాతం పనులు పూర్తి చేశాం..
జిల్లాలో 226 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా పనులు చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తరగతి గదులు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ పనులు చేపట్టాం. ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తుంది. జిల్లాలో 1,600 మంది ఉపాధ్యాయులకు వేసవిలో విద్యాబోధనపై రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి.
– పాణిని, జిల్లా విద్యాశాఖ అధికారి