
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్/వాజేడు : ములుగు మండలంలోని ఇంచర్లలో గల తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీలో అడ్మిషన్లకు విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 83339 25356, 89194 36509 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాజేడు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కశాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్లో 38, బైపీసీ ప్రథమ సంవత్సరంలో 27 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాని కోరారు.
తొందరపడి
విత్తనాలు నాటొద్దు
ములుగు రూరల్ : సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతనే రైతులు విత్తనాలు నాటుకోవాలని, తొందరపడి విత్తుకోని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారనే సమాచారం వచ్చిందని, దాదాపు 65నుంచి 75 మిల్లిమీటర్ల వర్షం కురిసిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలని సూచించారు.
పుష్కర పనులు
పూర్తి చేయాలి
కాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు కాళేశ్వరంలో జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా పుష్కరాల సమయంలో సమయాభావంతో కొ న్ని పనులు నిలిచిపోయాయి. వాటిని రెండు రోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు ఈఓ మహేష్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆయన సంబంధిత కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో నిలిచిన పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, వీఐపీ ఘాటు పుష్కరఘాటు, సరస్వతీ అమ్మవారి విగ్రహంపై స్లాబు, అక్కడి తోరణాలు, ప్రసాద కౌంటర్, కల్యాణకట్ట, మరుగుదొడ్ల నిర్మాణాలు, మెయిన్ఘాటు తోరణం పనులు నిలిచిన విషయం తెలిసిందే.
గుండెపోటుతో
తహసీల్దార్ మృతి
హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రె శ్రీపాల్రెడ్డి (47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సాయంతోనే విధులు నిర్వహిస్తు రెవెన్యూ సదస్సుల్లోనూ పాల్గొంటున్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల్లో ఆయనకు మంచిపేరు, గుర్తింపు ఉన్నాయి. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసి పలువురు హనుమకొండ రాంనగర్లోని ఆ యన ఇంటికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. శ్రీ పాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు.