
నాగాభరణం బహూకరణ
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామికి ఓ భక్తుడు రూ.24లక్షల విలువైన మిశ్రమ బంగారు నాగాభరణం సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు.
ఐదుగురు ఏఆర్లకు
అంతర్గత బదిలీలు
కేయూలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల (ఏఆర్)ను అంతర్గంగా బదిలీలు చేశారు.
– IIలోu
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న
మంత్రి సీతక్క
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి సీతక్క
ములుగు: ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో సోమవారం రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎస్పీ డాక్టర్ శబరీశ్ సమక్షంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బీఆర్ అంబేడ్కర్, గాంధీజీ, జయశంకర్ల చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ దివాకర, ఎస్పీలతో పాటు మంత్రి పరేడ్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్–2047 విజన్తో తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఉత్తమంగా నిలబెట్టడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా వంటివి కళ్లముందు కనిపిస్తున్న నిదర్శనాలు అన్నారు. వికలాంగులకు అండగా 21 రకాల వైఫల్యాలను గుర్తించి సదరం సర్టిఫికెట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 476 మంది వికలాంగులను గుర్తించి 150 మందికి బ్యాటరీ వీల్చైర్లు, 250 మందికి వీల్చైర్లు, 40 మందికి హియరింగ్ ప్యాడ్స్, 150 మందికి ట్రై సైకిళ్లు అందించినట్లు వివరించారు.
లింకేజీ రుణాలు.. రైతు రుణమాఫీ
బ్యాంకు లింకేజీ కింద 2,590 సంఘాలకు రూ.230.21కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. సీ్త్రనిధి కింద 456 సంఘాలకు రూ. 17.26కోట్లు అందించామన్నారు. 26,811 మంది రైతులకు రూ. 219.97కోట్లు రుణమాఫీ చేశామని వెల్లడించారు. రైతు భరోసా కింద 68,687 మంది రైతుల ఖాతాలలో రూ.63.93కోట్లు జమ చేశామని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా మృతిచెందిన 145 రైతుల కుటుంబాలకు రూ. 54లక్షల చొప్పున రూ.7.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
యాసంగిలో 74,212 టన్నుల
ధాన్యం కొనుగోలు
యాసంగిలో 152 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర ఆధారంగా 74,212 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.124.48కోట్లు రైతులకు అందించామన్నారు. ఇప్పటి వరకు రూ.32 కోట్ల బోనస్ అందించినట్లు వివరించారు. జిల్లాలో అత్యంత నిరుపేదలకు 4,145 ఇళ్లను మంజూరు చేశామన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టామని అన్నారు. నర్సింగ్ కళాశాలలో 60 సీట్లు మంజూరు కాగా 56 మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. వైద్య కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ప్రశాద్ స్కీంలో భాగంగా రూ. 61.99 కోట్ల నిధులతో రామప్ప, పాలంపేట ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
న్యూస్రీల్
– మరిన్ని ఫొటోలు II,IIIలోu
అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
తంగేడు స్టేడియంలో ఘనంగా
రాష్ట్ర అవతరణ వేడుకలు
1,867 సీసీ కెమెరాల ఏర్పాటు
పోలీసు శాఖ తరఫున జిల్లా వ్యాప్తంగా 1,867 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 669 మంది పోగొట్టుకున్న సెల్ఫోన్లను బాధితులకు అందిచామని తెలిపారు. సైబర్ నేరాలలో చిక్కుకున్న వారికి రూ. 5,96,618 లను తిరిగి అందించామన్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు రూ.16,01,317 విలుగల 47 కేజీల గంజాయిని సీజ్ చేసి 36 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మినీ మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల బియ్యాన్ని ఏకకాలంలో అందిస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి సీతక్క వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్జీ, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.

నాగాభరణం బహూకరణ

నాగాభరణం బహూకరణ

నాగాభరణం బహూకరణ

నాగాభరణం బహూకరణ