
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు అథ్లెటిక్స్ కు ఎంపిక కావడంతో చిన్నారులను అభినందించారు. మండలంలోని రొ య్యూర్కు చెందిన గుండెల మణితేజ, తాండ్ర అజయ్, తాండ్ర గౌతమ్, లక్ష్మీప్రసన్నలు జూన్ 1న హైదరాబాద్లోని జింఖాన గ్రౌండ్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని రొయ్యూర్ గ్రామస్తులు చంటి, గుండెల కుమార్, తాండ్ర రామ్మూర్తి అభినందించారు.