
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
వెంకటాపురం(ఎం): ప్రతి ఒక్కరూ ఎయిడ్స్పై తప్పకుండా అవగాహన కలిగి ఉన్నపుడే ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని మొబైల్ ఐసీటీసీ కౌన్సిలర్ కుమారస్వామి తెలిపారు. మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించి ప్రజలకు హెచ్ఐవీ పరీక్షలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన ఇంజక్షన్ల ద్వారా, పరీక్షించని రక్త మార్పిడి ద్వారా ఎయిడ్స్ వ్యాధి సోకుతుందన్నారు. హెచ్ఐవీ సోకిన గర్భిణి నుంచి కూడా పుట్టబోయే బిడ్డకు వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఆర్జీఆర్ లింక్ వర్కర్స్ కిషన్, స్వప్న, రాము, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి
ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్ల లను చేర్పించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సమ్మారావు, జిల్లా అధ్యక్షుడు సమ్మ య్య అన్నారు. మండల కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార జాతను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు వాసం సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బడి బాట జాతను రామన్నగూడెం, పాప్కాపూర్, భూటారం, ఎక్కిల గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇంగ్లిష్లో బోధన చేయడంతో పాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు. డిజిటల్ క్లాస్లు, ఉచిత పాఠ్య పుస్తకాలు, బట్టలు నోట్ బుక్స్ ప్రభుత్వమే అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వెంకటస్వామి, కిరణ్, ప్రసాద్, పురుషోత్తం, ఎస్ఎఫ్ఐ నాయకులు తోకల రవి, సీపీఎం నాయకులు ఎండి దావూద్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైనింగ్ కిట్ల అందజేత
భూపాలపల్లి: సింగరేణి జీవీటీసీలో లైసెన్స్డ్ సర్వేయర్లకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. అభ్యర్థులకు ట్రైనింగ్ కిట్లను అందజేసి, శిక్షణ కార్యక్రమంలో నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి పాల్గొన్నారు.
ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలో విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేయాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ మల్సూర్ నాయక్ ఆపరేటర్లకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని విద్యు త్ కేబుల్ టీవీ వైర్లు వివిధ కంపెనీల ఇంట ర్నెట్ వైర్లు విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా తగిలించడంతో విద్యుత్ సిబ్బందికి మరమ్మతు చేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. కొన్ని రో డ్లపై కిందికి వేలాడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, భూపాలపల్లి జిల్లాలోని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
చిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి.
● పరపతి సంఘం ద్వారా
సామాన్యుల విమానయానం
● కల నెరవేర్చుకున్న రైతులు,
కూలీలు, వృత్తిదారులు
● కుటుంబ సమేతంగా ఛార్ధామ్,
ఆగ్రా, కాశీ విహారయాత్రలు
● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు
విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది.
– గీసగోని రాజయ్య,
గీతకార్మికుడు
ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది.
గాల్లో వెళ్తుంటే బాగుంది..
గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది.
– రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల
అందరి కృషి..
పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి.
– చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల
సెల్ఫీ తీసుకుని మురిసిపోయా..
గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం.
– కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల
పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు.
ఆలోచన వచ్చిందిలా..
గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
న్యూస్రీల్
పరపతి
సంఘాలు..
ఐకమత్యానికి
నాంది
ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే..

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025