
‘రాజీవ్ యువ వికాసం’ ఇంటర్వ్యూలు
ఏటూరునాగారం: రాజీవ్ యువ వికాసం స్కీంకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక ప్రజాపరిషత్ కార్యాయంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా మండలంలోని ఏటూరునాగారం, అల్లంవారిఘణపురం, చెల్పాక, రొయ్యూర్, ముళ్లకట్ట, శంకరాజుపల్లి గ్రామాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎస్బీఐ అధికారులు సిబ్బంది స్క్రీనింగ్ టెస్ట్ ను ప్రక్రియ నిర్వహించా రు. అయితే, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ ఈ ప్రక్రియను పరిశీలించారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(ఎం): ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ రాజు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువవికాసం పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూ లు ని ర్వహించారు. ములుగు తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలో 301 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ, ఈబీసీ అభ్యర్థులకు, ఇంచర్ల ఎస్బీఐ పరిఽ దిలో 372 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలి పారు. మంగళవారం ఎస్బీఐ గణపురం, వెంకటా పురం టీజీబీ పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వాజేడు: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించారు. మండల వ్యాప్తంగా 1700 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1100 మందిని అర్హులుగా నిర్ధారించారు.
వెంకటాపురం(కె): ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్లో రాజీవ్ యువశక్తి పథకం లోన్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. బ్యాంక్లో ఎస్టీ అభ్యర్థులు 309 మంది దరఖాస్తు చేసుకోగా 188 మంది, ఎస్సీ 187 మంది దరఖాస్తు చేసుకోగా 129 మంది, బీసీలు 229 దరఖాస్తు చేసుకోగా 166 మంది, ఈబీసీ, మైనారీటి అభ్యర్థులు 9 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
నేడు, రేపు రాజీవ్ యువవికాసం ఇంటర్వ్యూలు
ములుగు : రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాలకు దరాఖాస్తులు చేసుకున్న అ భ్యర్థులకు నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. 27న కెనరాబ్యాంకు, 28న యూబీఐ, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు ఉంటాయని అన్నారు. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.