‘చలో వరంగల్‌’ను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘చలో వరంగల్‌’ను విజయవంతం చేయండి

May 27 2025 12:55 AM | Updated on May 27 2025 12:55 AM

‘చలో వరంగల్‌’ను విజయవంతం చేయండి

‘చలో వరంగల్‌’ను విజయవంతం చేయండి

గోవిందరావుపేట: ఈ నెల 31న వరంగల్‌ నగరా నికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ వస్తున్నందున హ లో మాదిగ చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి డి.రామకృష్ణ అన్నారు. మండలంలోని పస్రా గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు పసుల భఽద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ హజరై మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని ఈ నెల 31న వరంగల్‌ నగరానికి ఢిల్లీ నుంచి వస్తున్న మంద కృష్ణ మాదిగకి ఘన స్వాగతం పలకడానికి ఎమ్మార్పీ స్‌, అనుబంధ సంఘాల శ్రేణులు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో ఇరుగు పైడి, శ్యాంబాబు, నరసయ్య, కరణాకర్‌,బలరాం, రమేష్‌, రాంబాబు, మొగిలి, సాంబయ్య, రంజీత్‌, సురేష్‌ పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement