వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి

May 27 2025 12:55 AM | Updated on May 27 2025 12:55 AM

వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి

వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి

వెంకటాపురం(ఎం): రాబోయే వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ చీర్ల శ్రీకాంత్‌ గొత్తికోయలకు సూచించారు. సోమవారం మండలంలోని తొర్రిచింతలపా డు, రోలుబండ గోత్తికోయగూడేల్లో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 62 మంది గొత్తికోయలకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గర్భిణులకు, పిల్లలకు టీకాలు వేశారు. అనంతరం గొత్తికోయలతో డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, వాటి ద్వారా మలేరియా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. వర్షాకాలంలో కాచి వడబోసిన నీటిని తాగాలని సూచించారు. ఎవరైనా ఆనారోగ్యానికి గురైతే స్థానిక వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ నవీన్‌కుమార్‌, హెల్త్‌ ఆసిస్టెంట్‌ మోతీలాల్‌, ఏఎన్‌ఎంలు అనురాధ, స్వప్న, ఆశా కార్యకర్తలు సరోజన, మాధవి, సౌజన్య, ఇందిర, కవిత, సంపూర్ణ, శోభ పాల్గొన్నారు.

పీహెచ్‌సీ వైద్యాధికారి చీర్ల శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement