
అడవుల్లో ప్లాస్టిక్ పడేయొద్దు
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్
ఏటూరునాగారం: అడవుల్లో ఎక్కడ కూడా వ్యర్థాలు, ప్లాస్టిక్ను పడవేయద్దని అటవీశాఖ సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లకు ఆయన సోమవారం అవగాహన కల్పించి మాట్లాడారు. అడవుల్లో ఉండే వన్యప్రాణులకు ప్లాస్టిక్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ చల్లా శ్రీనివాస్తో పాటు డ్రైవర్లు పాల్గొన్నారు.