
రహదారులకు మరమ్మతు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారులకు శనివారం అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు, సరస్వతి ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారులు బురదమయంగా మారిపోయాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు హుటాహుటిన మరమ్మతు చర్యలకు పూనుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా స్టోన్ డస్ట్ వేసి రహదారులను బాగుచేశారు.