
పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య
ఎస్ఎస్తాడ్వాయి: రెండు సార్లు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన పెద్ది శృతి(19) చిన్నతనంలో తండ్రి నాగభూషణం మృతి చెందాడు. దీంతో ఆమె మేనమామ బండి శ్రీను మేనకోడలైన శృతిని సాదుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఈనెల 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. ఈ విషయం గమనించి చికిత్స నిమిత్తం పీహెచ్సీకి తరలించగా పరిశీలించిన సిబ్బంది ములుగు ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యాధికారులు పరీక్షించి మృతి చెందినట్లు నిరార్థించారు. శనివారం బండి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ అక్కడకు చేరుకుని శృతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదని తెలిపారు. యువత క్షిణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి, సింగారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.