చిట్యాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన 52మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీదేవి–సత్యం, టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ కృష్ణ, కుమార్, లక్ష్మన్, అనిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.