
వైద్యసేవలు విస్తరించాలి
ములుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాధినిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ, సంక్రమిత, అసంక్రమిత వైద్య సేవలను గ్రామాల్లో విస్తరింపజేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని శాఖ కార్యాలయం నుంచి ఎంఎల్హెచ్పీలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. హెల్త్ మేళా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, లైన్ లిస్టులను పీహెచ్సీల వారిగా కో ఆర్డినేట్ చేసుకొని జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి అందించాలని సూచించారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమాలను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 100శాతం పూర్తి చేయాలన్నారు. వ్యాధి టీకాలు వేసిన అనంతరం ఆరోగ్య పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని తెలిపారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పవన్కుమార్, డెమో సంపత్, ఎన్సీడీ కో ఆర్డినేటర్ వెంకట్రెడ్డి, డీడీఎం ప్రవీణ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు